సీఎం జగన్‌ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు

29 Sep, 2019 18:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపటి తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. మొదట రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుచానూరు సమీపంలోని పద్మావతి నిలయానికి ప్రారంభోత్సవం చేసి.. అనంతరం అలిపిరి వద్ద నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేసి తిరుమలకు వెళ్ళాల్సిఉంది..కానీ మారిన షెడ్యూల్‌ ప్రకారం పద్మావతి నిలయం ప్రారంభోత్సవం అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌..పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మొదటిసారిగా వస్తున్నారు. సీఎం రాక సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు