భూమా నాగిరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ

7 Jul, 2015 12:49 IST|Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్యం కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ఆయన పరామర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పీఎసీ చైర్మన్, నంద్యాల ఎమ్యెల్యే భూమా నాగిరెడ్డిపై అధికార పార్టీ అండదండలతో అక్రమ కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టు అయిన ఆరోగ్య కారణాలరీత్యా కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు కడప కు బయల్దేరి వెళతారు.

మరిన్ని వార్తలు