శారదాపీఠాన్ని సందర్శించిన వైఎస్ జగన్

27 Jan, 2015 17:51 IST|Sakshi
శారదాపీఠాన్ని సందర్శించిన వైఎస్ జగన్

విశాఖపట్నం: విశాఖపట్నంలోని శారదాపీఠంలోని పలు ఆలయాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఆయనకు శారదాపీఠం నిర్వాహకులు ఎదురువెళ్లి ఘన స్వాగతం పలికారు. శారదాపీఠం నిర్వహిస్తున్న చతుర్వేద యఙయాగంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆలయ విశిష్టతను  స్వామి స్వరూపానందను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు