తెలుగు ప్రజలకు సీఎం జగన్‌ శ్రీరామనవమి శుభాకాంక్షలు

1 Apr, 2020 20:59 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ శ్రీరామనవమి వేడుకలు ఇంటింటా జరుపుకోవాలని కోరారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలకు శుభాలకు కలగాలని సీఎం వైఎస్‌ జగన్‌ అభిలాషించారు.

మరిన్ని వార్తలు