అమరవీరుల అడుగుజాడల్లో నడుద్దాం

15 Aug, 2017 03:15 IST|Sakshi
అమరవీరుల అడుగుజాడల్లో నడుద్దాం

తెలుగు ప్రజలకు జగన్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు  
సాక్షి, అమరావతి: 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరుల అడుగుజాడల్లో నడుద్దామని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహనీయుల నిబద్ధత,  దేశభక్తి మనకు స్వాతంత్య్రం తెచ్చిపెట్టిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆ పార్టీ ఘనంగా నిర్వహించనుంది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేస్తారని పార్టీ కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరింది.

మరిన్ని వార్తలు