2న శ్రీకాకుళంలో జగన్ ‘యువభేరి’

21 Jan, 2016 04:39 IST|Sakshi
2న శ్రీకాకుళంలో జగన్ ‘యువభేరి’

వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి వెల్లడి
 

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టౌన్ హాల్‌లో ఫిబ్రవరి 2న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘యువభేరి’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. వారు బుధవారం టౌన్‌హాల్‌లో ఓ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 2న ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం పట్టణానికి చేరుకుంటారని చెప్పారు. తర్వాత టౌన్‌హాల్‌లో నిరుద్యోగులు, యువతతో ప్రత్యక్షంగా మాట్లాడుతారని పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరుగుతున్న అన్యాయం, కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ప్రస్తావిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో యువత బంగారు భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలను జగన్ వివరిస్తారని అన్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు దారుణంగా ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై జగన్ మాట్లాడుతారని వారు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు