రిసెప్షన్‌ వేడుకకు హాజరైన వైఎస్‌​ జగన్‌

6 Feb, 2020 21:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర రవాణ శాఖ, ఆర్‌ అండ్‌ బి ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు కుమారుడి రిసెప్షన్‌ వేడుక విజయవాడలోని ఎస్‌.ఎస్‌.కన్వెన్షన్‌ హాల్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రిసెప్షన్‌ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన వధూ వరులు స్వరూప్, సోనాలి జంటను ఆశీర్వదించారు. కాగా వైఎస్‌ జగన్‌ వెంట మంత్రులు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణ రెడ్డి, జోగి రమేశ్‌, భూమన కరుణాకర్‌రెడ్డి, పార్థసారధి, పలువురు అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు