జ్యోతుల నెహ్రుకు వైఎస్ జగన్ పరామర్శ

1 Apr, 2015 12:42 IST|Sakshi
జ్యోతుల నెహ్రుకు వైఎస్ జగన్ పరామర్శ

రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రు కుటుంబాన్ని పరామర్శించారు. ఈరోజు ఉదయం ఆయన  హైదరాబాద్ నుంచి విమానంలో మధురవాడ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో జగ్గంపేట  మీదగా ఇర్రిపాక వెళ్లారు. ఇటీవల నెహ్రు సోదరుడు సత్తిబాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా వైఎస్ జగన్తో పాటు పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు జ్యోతుల నెహ్రును పరామర్శించారు.

>
మరిన్ని వార్తలు