వైఎస్సార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

19 Aug, 2019 09:48 IST|Sakshi

సాక్షి, గుంటూరు : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని కాకుమానులో ఆదివారం చోటుచేసుకుంది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని  వెంటనే అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.

మరిన్ని వార్తలు