హైదరాబాద్ : వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పంచాయతీ ఎన్నికలపై శనివారం పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. ఆసెంబ్లీ కో ఆర్డినేటర్లు, పార్లమెంట్ అబ్జర్వర్లు, పార్టీ ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించారు. అలాగే పార్టీ ముఖ్య నేతల నుంచి ఫోన్ ద్వారా విజయమ్మ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేలా నేతలకు ఆమె దిశ నిర్దేశం చేశారు. ఇప్పటికే సీనియర్ నేతలతో సెంట్రల్ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆయా నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు విజయమ్మ పర్యవేక్షిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.