సాక్షి, వైఎస్సార్ జిల్లా : మాజీ మంత్రి , దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి ప్రథమ వర్థంతి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులు పులివెందులలో నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలోని వైఎస్ వివేకా సమాధి వద్ద వైఎస్ విజయమ్మ, ఎంపీ అవినాష్ రెడ్డి, సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్, వివేకా సోదరి విమలమ్మ నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.