‘వైయస్సార్‌ ఛాయలో’ పుస్తకావిష్కరణ

8 Sep, 2019 12:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి  ప్రముఖ జర్నలిస్ట్‌ జి.వల్లీశ్వర్‌ రచించిన ‘వైయస్సార్ ఛాయలో’ అనే పుస్తక ఆవిష్కరణ వేడుక అమీర్‌పేటలోని ఆదిత్యపార్క్‌లో జరిగింది.  ఈ పుస్తకాన్ని పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సీనియర్‌ పాత్రికేయులు కే.రామచంద్రమూర్తి పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు