ప్రజలను మభ్యపెట్టడానికే సీఎం రాజీనామా డ్రామా

19 Feb, 2014 13:22 IST|Sakshi
బాలినేని శ్రీనివాసరెడ్డి

రాష్ట్ర విభజన ఆపుతానని చెప్పి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రజలను మోసం చేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  సీఎల్పీ ఉపనేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అంత  అయిపోయాక సీఎం రాజీనామా చేయడం వల్ల ఏం ప్రయోజనం అని ఆయన ప్రశ్నించారు.

 

లాస్ట్ బాల్ సిక్స్ కొడతానని చెప్పి  చివరకు సీఎం కిరణ్ డకౌటయ్యాడని బాలినేని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పుడే  కిరణ్ రాజీనామా చేసి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడానికే ఇప్పుడు కిరణ్  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా డ్రామా ఆడుతున్నారని బాలినేని శ్రీనివాస రావు ఆరోపించారు.
 

>
మరిన్ని వార్తలు