ప్రకాశం జిల్లాలో 'పోరుబాట'

5 Nov, 2014 14:31 IST|Sakshi
ప్రకాశం జిల్లాలో 'పోరుబాట'

హైదరాబాద్ : ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి ... అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలో పోరుబాట నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమాలలో డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాటి వివరాలు....

జిల్లాలోని కనిగిరి, కిష్టంపాడు, వెనిగండ్ల, పీఎస్ పురం, పామూరు,పీసీ పల్లి ఎమ్మార్వో కార్యాలయాల వద్ద వైఎస్ఆర్ సీపీ పోరుబాట నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సంతమాగలూరు: ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ఆందోళన
ఎర్రగొండపాలెం: పి.డేవిడ్రాజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
దర్శి: స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
పొదిలి: మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పిచ్చిరెడ్డి, ఎంపీపీ నర్సింహారావు, జడ్పీటీసీ సాయిరాజేశ్వరరావు ధర్నా నిర్వహించారు.
పెద్దారవీడు: మండల కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు