మళ్లీ రాజన్న రాజ్యం తెస్తామని భరోసా...

8 Jul, 2017 11:45 IST|Sakshi
మళ్లీ రాజన్న రాజ్యం తెస్తామని భరోసా...

గుంటూరు : రాష్ట్రం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై  ప్లీనరీలో చర్చించి పరిష్కారం కనుగొంటామని వైఎస్‌ఆర్‌ సీపీ నేత నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  ప్రజలకు మేమున్నామంటూ వైఎస్‌ఆర్‌ సీపీ భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు. రానున్న కాలంలో రాష్ట్రంలో తిరిగి రాజన్నరాజ్యం తెస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ... ప్రజారంజక పాలన ఇస్తానంటూ హామీలిచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని అన్నారు. చంద్రబాబుకు బుద్ధివచ్చేలా వైఎస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో అనేక తీర్మానాలు చేస్తున్నామని చెప్పారు. అలాగే వైఎస్‌ జగన్‌ నేతృత్వంతో ప్రజలందరికీ భరోసా కల్పించే దిశగా తమ కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు