వైఎస్సార్ సీపీ సమావేశ వేదిక మార్పు

29 Nov, 2014 01:48 IST|Sakshi
వైఎస్సార్ సీపీ సమావేశ వేదిక మార్పు

కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ త్రిసభ్య కమిటీ ఈ నెల 30న కాకినాడలో నిర్వహించే జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని బాలాత్రిపురసుందరి ఆలయ సమీపంలోని గ్రంధి బాబ్జీ కల్యాణమండపంలో నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సమావేశాన్ని సూర్యకళామందిరంలో నిర్వహించాలని తొలుత అనుకున్నా వేదికలో మార్పు చేసినట్టు తెలిపారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలని కోరారు.

మరిన్ని వార్తలు