‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది వైఎస్సార్‌’

15 Nov, 2018 17:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై  వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శ్రీకారం చుట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2009లోనే ప్రాజెక్ట్‌కు ఆయన శంకుస్థాపన చేశారని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. పరిపాలనా అనుమతులు, 50 కోట్ల నిధులు కూడా వైఎస్సార్‌ కేటాయించారని విజయసాయిరెడ్డి తెలిపారు. 

దీనిని పూర్తి చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినా ఇన్నేళ్లలో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మళ్లీ శంకుస్థాపన చేసి సరికొత్త డ్రామాకు తెరలేపారని ధ్వజమెత్తారు.

 

>
మరిన్ని వార్తలు