వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం రేపు సమావేశం

24 May, 2019 18:52 IST|Sakshi

హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం రేపు(మే 25న) ఉదయం పదిన్నర గంటలకు పార్టీ కార్యాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ఎమ్మెల్సీలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం ఉదయం 11.30 గంటలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ శాసనసభ్యుల బృందం రేపు మధ్యాహ్నం గవర్నర్‌  నరసింహన్‌ను కలవనున్నట్లు పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు