విశాఖ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ వంశీకృష్ణ
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. విశాఖ పశ్చిమ కన్వీనర్ మళ్ల విజయ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరత్నాల ప్రయోజనాలతో విశాఖ కార్పొరేషన్ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పారిశ్రామికవాడకు చెందిన టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బెహరా భాస్కరరావు, శ్రీదేవి వర్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.