రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించాలి: వైఎస్ఆర్సీపీ

6 Sep, 2014 11:41 IST|Sakshi

హైదరాబాద్ : అన్ని విధాల నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందలేదని ప్రతిపక్షం స్పష్టం చేసింది. శనివారం చివరిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ గతేడాది పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్‌ చెల్లింపుతో పాటు, ఇన్‌పుట్‌ సబ్సిడీపై చర్చకు పట్టుపడుతూ వాయిదా తీర్మానం కోరారు.

 

అయితే దానికి తిరస్కరించిన స్పీకర్‌.. ప్రశ్నోత్తరాలు చేపట్టారు.  దీనిపై చర్చ కోరిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చివరకు ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఇచ్చారు. గత ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరారు.

 

మరిన్ని వార్తలు