దేవినేని ఉమకు జోగు రమేష్ బహిరంగ సవాల్

30 Oct, 2015 19:58 IST|Sakshi

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగు రమేష్ బహిరంగ సవాల్ విసిరారు. మీడియా సమక్షంలో వైఎస్ఆర్ సీపీ నేతలతో కృష్ణా డెల్టాలో పర్యటించే దమ్ము, ధైర్యం మీకుందా అంటూ దేవినేని ఉమాను ప్రశ్నించారు. కృష్ణాజిల్లా వాసులకు సాగు, తాగునీరు అందించలేదని నువ్వు రాయలసీమను రతనాల సీమ చేస్తావా అంటూ జోగు రమేష్ ఈ సందర్భంగా ఉమపై ధ్వజమెత్తారు.
 

మరిన్ని వార్తలు