మట్టిని 'రియల్' వ్యాపారులకు అమ్ముతున్నారు..

3 May, 2015 20:34 IST|Sakshi
మట్టిని 'రియల్' వ్యాపారులకు అమ్ముతున్నారు..

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేయడంపై వైఎస్సార్ సీపీ మండిపడింది.  ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముతున్నారని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నీరు-చెట్టు పథకం పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు.

 

కృష్ణా జిల్లాలో భారీగా మట్టి కుంభకోణం జరుగుతున్నా.. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా పార్థసారధి ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు