'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య'

11 Aug, 2014 08:50 IST|Sakshi
'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య'

విజయవాడ :  గొట్టిముక్కల ఉప సర్పంచ్, వైఎస్ఆర్ సీపీ నేత కృష్ణారావు హత్యను ఆపార్టీ సీనియర్ నేత పార్థసారధి తీవ్రంగా ఖండించారు. కృష్ణారావుకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని గతంలోనే జిల్లా ఎస్పీని కోరామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే ఈ హత్య జరిగిందని పార్థసారధి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం, మంత్రి దేవినేని ఉమా కలిసి  చేసిన హత్య అని ఆయన ఆరోపించారు.

 

మరిన్ని వార్తలు