శ్రీవారిని దర్శించుకున్నవిజయసాయిరెడ్డి

5 May, 2016 09:11 IST|Sakshi
శ్రీవారిని దర్శించుకున్నవిజయసాయిరెడ్డి

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం పలువురు రాజకీయం ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తదితరులతో కలసి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో వారికి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఏఈవో కె.శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్‌సాయిరెడ్డి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే, ప్రభుత్వ విప్ మేడ వెంకట మల్లికార్జునరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి స్వామి సేవలో పాల్గొన్నారు.


.

మరిన్ని వార్తలు