దుస్తులు పంపిణీ చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు

7 Jan, 2019 22:00 IST|Sakshi

జగన్‌తో కలిసి పాదయాత్ర చేసిన 50మందికి దుస్తులు పంచిన వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, శ్రీకాకుళం : ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర తుది అంకానికి చేరుకుంది.ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తున్న 50 మందికి వైఎస్సార్‌సీపీ నేతలు దుస్తుల పంపిణీ చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు భూమన కరుణాకర్‌ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, పార్టీ ఎన్నారై విభాగం (అమెరికా) కన్వీనర్‌ రత్నాకర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేసిన వారిని అభినందించారు.

గత ఏడాది నవంబర్ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 9న జననేత పాదయాత్ర ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.

మరిన్ని వార్తలు