వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

11 Sep, 2019 11:21 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ సీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ, చల్లా రామక్రిష్ణారెడ్డి, ఇక్బాల్‌లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ బుధవారం శాసనమండలి చైర్మన్‌ ఎం.ఎ షరీఫ్‌ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మోపిదేవి వెంకటరమణ, చల్లా రామక్రిష్ణారెడ్డిలు భగవద్గీత మీద, ఇక్బాల్‌ ఖురాన్‌ మీద ప్రమాణం చేసి ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు