పాల కన్నయ్య రెడ్డికి నివాళి

12 Jun, 2019 21:25 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం :  వైఎస్సార్‌సీపీ ఎన్నారై నేత పాల త్రివిక్రమ భానోజి రెడ్డి తండ్రి కన్నయ్యరెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు నివాళి అర్పించారు.  కన్నయ్య రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌ హజరవాల్సిఉండగా.. అసెంబ్లీలో పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం వల్ల రాలేకపోయారని భానోజిరెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు భాజోజి రెడ్డి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, నాగిరెడ్డిలను మర్యాదకపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. 

మరిన్ని వార్తలు