హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రికపై మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం పరువునష్టం దావా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై అసత్య కథనాలు రాశారంటూ ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు, ఆగస్టు ఒకటో తేదీన ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.