చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలి

17 Feb, 2020 16:37 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు

సాక్షి, నిడదవోలు: ఐటీదాడుల్లో వెలుగు చూసిన అక్రమాలు శాంపిల్‌ మాత్రమేనని..టీడీపీ ముఖ్య నేతలపై కేంద్రం దృష్టి సారిస్తే నమ్మలేని వాస్తవాలు బయటకు వస్తాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దందాలు, కుంభకోణాలను వెలికితీయాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు.(ఐటీపై ఎల్లో డ్యాన్స్‌)

ఐటీ దాడుల్లో వెలుగు చూసిన  రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయన్నారు. రాజధాని భూముల వ్యవహారంలో కూడా వేల కోట్లు చేతులు మారాయని.. వీటిపై కేంద్రం విచారణ జరిపించాలని కోరారు. చంద్రబాబు ఆస్తులపై విచారణ చేపట్టాలని శ్రీనివాస్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. ('మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా')

మరిన్ని వార్తలు