ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమితులైన రోజా

10 Jul, 2019 21:35 IST|Sakshi

అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్‌.కే.రోజాను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వుల జారీ చేసింది. ఆమె రెండేళ్ల పాటు ఆ పదవికిలో కొనసాగనున్నారు. ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమించడం పట్ల నగరి నియోజకవర్గం ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు