జమ్మలమడుగులో వైఎస్ఆర్ సీపీ నేతల ధర్నా

30 Jun, 2014 11:16 IST|Sakshi
జమ్మలమడుగులో వైఎస్ఆర్ సీపీ నేతల ధర్నా

కడప : వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ధర్నా చేపట్టారు. డీలర్లు, మధ్యాహ్న భోజన నిర్వహకులు, ఇతర ఉద్యోగుల తొలగింపునకు నిరసనగా పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, రఘురామిరెడ్డి,  ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, రాచమల్లు, జయరాములు, డీసీసీబీ ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు.

 

మరిన్ని వార్తలు