‘ఇవే బాబు మార్క్‌ విచారణలు!’

8 Nov, 2018 19:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. విశాఖ భూకుంభకోణంపై సిట్‌ నివేదిక బాబు స్వీయ దర్శకత్వంలో తయారైన ‘హిజ్‌ మాస్టర్స్‌ వాయిస్‌’లా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కుంభకోణంలో విలన్‌ పాత్రధారులైన ‘ఎల్లో మాఫియా గ్యాంగ్‌’లో ఒక్కరి పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకుని ‘మాస్టర్‌’ పట్ల తిరుగులేని విశ్వాసాన్ని సిట్ చాటుకుందని ఎద్దేవా చేశారు‌.

రిషితేశ్వరి మరణం, వనజాక్షిపై దాడి, నారాయణ, చైతన్య కాలేజీల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు, పుష్కరాల్లో తొక్కిసలాట, లాంచి ప్రమాదం, రత్నాచల్‌ రైలు దగ్ధం, కాల్‌మనీ రాకెట్‌, విశాఖ భూకుంభకోణం వరకు జరిపిన విచారణల్లో నిజమైన దోషిని ఒక్కరిని పట్టుకోలేదు, శిక్షించలేదని తెలిపారు. ఇవే బాబు మార్క్‌ విచారణలు అని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు