'నా భర్తను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు'

23 Jun, 2015 13:33 IST|Sakshi

ప్రకాశం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వ్యవహారం మరువక ముందే మరో వివాదం తెరలేసింది. తాజాగా ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ వెంకట్రావును కిడ్నాప్ చేశారని ఆయన భార్య మేరీ ఫిర్యాదు చేసింది. అధికార టీడీపీ వర్గమే తన భర్త కిడ్నాప్ నకు కారణమని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. వెంకట్రావు వినమననెల్లూరు నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. తన భర్తకు ఇంటికి తీసుకు రావాలని మేరీ పోలీసులను కోరింది.

మరిన్ని వార్తలు