ప్రాంతీయ పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫేస్బుక్లో తన హవా కొనసాగిస్తోంది.మూడేళ్ల కింద వచ్చిన ఈ పార్టీ స్వల్పకాలంలోనే ఏకంగా మూడు లక్షల లైక్స్ను దాటింది. పదేళ్ల నుంచి ఆన్లైన్లో ఉన్న టీడీపీ ఇప్పటికీ 3 లక్షల మార్కు దాటలేకపోయింది. టీడీపీకి 2.87 లక్షల లైక్స్, లోక్సత్తాకు 1.15 లక్షల లైక్స్ ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల సంగతి చూస్తే, మహారాష్ర్టలోని ఎన్సీపీ ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంది. అది 2.05 లక్షల లైక్స్ను అధిగమించింది. యూపీలోని సమాజ్వాదీ పార్టీ 68,000 లైక్స్ను దాటగా, బీఎస్పీ 1,600 లైక్స్ వద్ద ఉంది. జేడీఎస్, ఆర్ఎల్డీల పరిస్థితి కూడా కాస్త అటుఇటుగా ఇలాగే ఉంది. ద్రవిడ పార్టీలను చూస్తే డీఎంకే 1,700, అన్నా డీఎంకే 762 లైక్స్లతో మరీ దీనంగా ఉన్నాయి. చాలా రాష్ట్రాలలో పార్టీలు ప్రత్యేకంగా ఫేస్బుక్ పేజీలనే రన్ చేయడంలేదు.
సోషల్ నెట్వర్క్లో యాక్టివ్గా ఉన్న వారి కోసం ప్రారంభించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఆన్లైన్ కమ్యూనిటీ పోర్టల్కు విశేష ఆదరణ ఉంది. వైఎస్ఆర్ పథకాలు, విజన్, జగన్ కార్యక్రమాలు, దీక్షలు, ఉద్యమాలు, ప్రణాళికలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంది. దాదాపు ఐదువేల రిజిస్టర్డ్ సభ్యులు ఈ పోర్టల్లోని సమాచారాన్ని తమ ఫేస్బుక్ పేజీలలో షేర్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనపై సీపీఎం ప్రచురించిన పుస్తకాలు, బీజేపీ పుస్తకం కూడా ఈ పోర్టల్లో ఉన్నాయి. వీడియోలు, కార్టూన్లు వీటికి అదనం.
వాట్స్యాప్ను విరివిగా ఉపయోగించుకుంటున్న పార్టీల్లోనూ వైసీపీ ముందంజలో ఉంది. పార్టీకి ఐటీ విభాగం వందల సంఖ్యలో బ్రాడ్కాస్ట్ గ్రూపులను ఏర్పాటు చేసి పొలిటికల్ కార్టూన్లు, సెటైర్లు, పోస్ట్లు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిని అందుకున్న ఆయా గ్రూపులలోని వైఎస్సార్ అభిమానులు తమ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్లతో ఏర్పాటు చేసుకున్న గ్రూపులకు వాటిని షేర్ చేస్తున్నారు. ఇలా ఈ పోస్ట్లు, వీడియోలు లక్షల మందికి చేరుతున్నాయి. ఇదే విభాగం రూపొందించిన యూట్యూబ్ చానెల్లో వందల సంఖ్యలో వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నికల ముందు జరుగుతున్న సర్వేల తరహాలోనే సోషల్ మీడియాలోనూ జగన్ హవా కొనసాగుతోందిన్నది. గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో జగన్ అందరికన్నా ముందున్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి పేరు సెర్చ్ చేస్తే 5,14,000 రిజల్ట్స్ వస్తున్నాయి. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేరుతో 2,79,000 రిజల్ట్స్, కిరణ్కుమార్రెడ్డి పేరుతో 1,07,000 రిజల్ట్స్ వస్తున్నాయి. నెటిజన్స్ ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్న పేర్లలో జగన్మోహనరెడ్డి అందరికన్నా ముందున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే ఆమ్ ఆద్మీ సోషల్ మీడియాలో ముందంజలో ఉంది. అయితే అన్ని రాష్ట్రాలకు విస్తరించడం వల్ల దానిని ప్రాంతీయ పార్టీగా పరిగణించలేం. అదీగాక 3 కోట్లు చేరుకుంటున్న ఢిల్లీ అర్బన్ ప్రాంతాలలో కేంద్రీకృతమైన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.