టెక్కలి సమన్వయకర్తగా పేరాడ తిలక్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ నియమితులయ్యారు. దువ్వాడ స్థానంలో టెక్కలి నియోజకవర్గ సింగల్ సమన్వయకర్తగా పేరాడ తిలక్ను నియమించారు.పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.