సమ్మెకు సంఘీభావం తెలిపిన వైఎస్సార్‌సీపీ

9 May, 2015 12:23 IST|Sakshi

విజయనగరం(పార్వతీపురం): పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు వైఎస్సాసీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణా రంగారావు, పుష్పశ్రీవాణిలు సంఘీభావం తెలిపారు. శనివారం ఆర్టీసీ కాంప్లెక్సు ఎదుట ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మెలో వైఎస్సార్‌సీపీతో పాటు సీపీఐ, సీఐటీయూ, పలు విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సులను డిపో నుంచి బయటకు వెళ్లకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు