వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల వాకౌట్

31 Jan, 2015 15:32 IST|Sakshi

గుంటూరు: జన్మభూమి సమావేశాలలో అనవసరంగా నిధులు దుర్వినియోగం చేశారని అడిగినందుకు టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. బాపట్లలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జన్మభూమి సమావేశాలు పెట్టుకునేందుకు రూ.2 వేలు సరిపోతాయి. కానీ రూ.2.5 లక్షలు అనవసరంగా ఎందుకు ఖర్చు చేశారని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అడిగినందుకు దౌర్జన్యానికి దిగారు. మీ ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని హేళన చేశారు. దీనికి నిరసగా కౌన్సిల్ సమావేశం నుంచి వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు.

(బాపట్ల)

మరిన్ని వార్తలు