పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ
రాజాం: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కుతారని వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం రాజాంలోని ఆయన బంధువుల ఇంటి వద్ద శుభ కార్యక్రమానికి వచ్చి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యకలాపాలే ఆ పార్టీకి డిపాజిట్లు కూడా లేకుండా చే స్తాయని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సం కల్ప యాత్ర ఓ ప్రభంజనమని అన్నారు.
ప్రజలు అంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ విజయనగరం జిల్లా వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లాన చంద్రశేఖర్, పార్టీ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి టంకాల అచ్చెన్నాయుడు, రేగిడి మండలం కన్వీనర్ వావి లపల్లి జగన్మోహనరావు, రాజాం పట్టణ నాయకులు పొట్నూరు లక్ష్మణరావు, పారంకోటి సుధ, బండి నర్శింహులు, ఆసపు సూర్యం తదితరులు పాల్గొన్నారు.