కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

31 Oct, 2018 17:56 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటరు జాబితాను పరిశీలించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఓటరు జాబితాలో తప్పుల సవరణకు మరింత సమయం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ జనరల్‌ సెక్రటరీ సజ్జల రామక్రిష్ణారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఓటరు జాబితాలో తప్పుల సవరణ గడువు బుధవారంతో ముగియనుండటంతో మరో నెల సమయం ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు