జగన్‌ సీఎం కావాలని తిరుమలకు పాదయాత్ర

28 Oct, 2017 08:37 IST|Sakshi
కాలినడకన తిరుమలకు వెళుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు

రాయచోటి రూరల్‌ : వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నవంబర్‌ 6 నుంచి ప్రారంభించనున్న పాదయాత్ర విజయవంతం కావాలని చిన్నమండెం జెడ్పీటీసీ కుటుంబ సభ్యులు కంచంరెడ్డి, మల్లూరు ఎంపీటీసీ వెంకటరమణ, చెన్నముక్కపల్లె ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, కిరణ్, నాగమునిరెడ్డి తదితరులు తిరుమలకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ముందుగా తిరుమల వెంకట్వేరస్వామి వారికి ఈ విషయమై మొక్కుకునేం దుకు కాలినడకన తిరుమలకు వెళుతున్నామన్నారు. జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు