-

నిఫ్టీకి నిరోధ శ్రేణి 10,450-10,500: ఉమేష్ మెహతా

6 Jun, 2020 11:40 IST|Sakshi

డౌన్‌సైడ్‌లో 10200 వద్ద కీలక మద్దతు స్థాయి 

టెక్నికల్‌గా అటో, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు డిమాండ్‌

నిఫ్టీ ఇండెక్స్‌కు తదుపరి కీలక నిరోధం 10,450-10,500 శ్రేణిలో ఉండొచ్చని సామ్‌కో సెక్యూరిటీస్‌ హెడ్‌ రీసెర్చ్‌ ఉమేష్‌ మెహతా అంచనా వేస్తున్నారు. 61శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్‌ స్థాయిలు ఇండెక్స్‌ను 10,450-10,500 స్థాయిలకు తీసుకెళ్లవచ్చని, ఈ తర్వాత కరెక‌్షన్‌ జరగవచ్చని ఆయన అంటున్నారు. ఒకవేళ​నిఫ్టీకి 10200 స్థాయిలో ఒత్తిడి ఏర్పడితే కరెక‌్షన్‌ ముందుగానే ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక వ్యాల్యూయేషన్‌ కలిగిన షేర్లకు కనిష్ట ధరల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడం, షార్ట్‌ కవరింగ్‌ సూచీలను 3నెలల గరిష్టానికి చేరుకునేందుకు సహకరించాయని ఆయనన్నారు. 

ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 1836 పాయింట్లు, నిఫ్టీ 562 పాయింట్లు లాభపడింది. జీడీపీ గణాంకాలు 11ఏళ్ల కనిష్ట స్థాయిలో నమోదు కావడంతో పాటు భారత సార్వభౌమ రేటింగ్‌ను మూడీస్‌ బ్రోకరేజ్‌ డౌన్‌గ్రేడ్‌ చేసినప్పటికి సూచీలు ఈ స్థాయిలో ర్యాలీ చేయడం విశేషం. 

టెక్నికల్‌ ఛార్ట్‌లను పరిశీలిస్తే... రియల్‌ ఎస్టేట్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ షేర్లు బలహీనంగా ఉన్నాయి. అటో రంగంలో ముఖ్యంగా టూ-వీలర్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు బలంగా ఉన్నాయని మెహతా తెలిపారు. అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధింపు సడలింపు, దేశీయ విమాన ట్రాఫిక్‌ నెమ్మదిగా పెరగడం, కంపెనీ బుక్‌లపై రియాలిటీ ప్రభావం మార్కెట్లకు కీలకం కానున్నాయి. అయితే గ్రౌండ్‌ రియాలిటీ పరిస్థితులు, ఇన్వెసర్ల సెంటిమెంట్ ఈ రెండు ఎంతవరకు కలిసిపోతాయో చూడాల్సి ఉందని మెహతా అంటున్నారు. 

‘‘ ఏదైనా సంక్షోభ సమయంలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. లాక్‌డౌన్ విధింపు మొత్తం ఆర్థిక వ్యవస్థను నిలిపివేసింది. ఈ పరిస్థితి బ్యాంకులు, ఫైనాన్స్‌ రంగ షేర్లలో అధిక ఒత్తిడిని కలిగించింది. ఈ ఒత్తిడి మరికొద్ది కాలం కొనసాగే అవకాశం ఉంది. మారిటోరియం సమయంలో వడ్డీ వసూలపై సుప్రీం కోర్టు నిర్ణయం జూన్‌ 12న వెలువడతుంది. అప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీపై ఒత్తిడికి లోనవుతుంది.’’ అని మెహతా తెలిపారు. 

మరిన్ని వార్తలు