మెర్సిడెస్ నుంచి కొత్త సీఎల్ఏ వెర్షన్

12 Dec, 2016 15:14 IST|Sakshi
మెర్సిడెస్ నుంచి కొత్త సీఎల్ఏ వెర్షన్

ప్రారంభ ధర రూ.31.4 లక్షలు
ముంబై: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘సీఎల్‌ఏ’లో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.31.4 లక్షలు-రూ.34.68 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ముంబై) ఉంది. అప్‌డేటెడ్ వెర్షన్‌లో కొత్త ఫ్రంట్ బంపర్, డైమండ్ పిన్ రాడియేటర్ గ్రిల్, కార్బన్ ఫైబర్ మిర్రర్స్, కొత్త లుక్‌తో కూడిన లెడ్ టెరుుల్ ల్యాంప్స్, 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్‌‌సమిషన్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వివరించింది. పెట్రోల్ వేరియంట్‌లో 2.0 లీటర్ ఇంజిన్‌ను, డీజిల్ వేరియంట్‌లో 2.2 లీటర్ ఇంజిన్‌ను అమర్చినట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు