న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,816 కోట్ల మూలధన కేటాయింపు లభించినట్లు ప్రకటించింది. ప్రాధాన్యతా కేటాయింపు మార్గంలో ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా ఈ మొత్తాన్ని అందుకున్నట్లు బ్యాంక్ తెలిపింది.
నియంత్రణ పరమైన ఆమోదాల అనంతరం మూలధన సాయం అందినట్లు వివరించింది. ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐదు పీఎస్యూలకు రూ.2.11 లక్షల కోట్ల నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. గడిచిన వారంలోనే అలహాబాద్ బ్యాంకు రూ.1,790 కోట్ల మూలధన సాయం అందుకున్నట్లు ప్రకటించింది.