ప్రముఖ కార్టూనిస్ట్‌, పాపులర్‌ ఫుడ్‌ బ్లాగర్‌ ఆత్మహత్య 

15 Apr, 2019 13:28 IST|Sakshi

మంగళూరు: ప్రముఖ కార్టూనిస్ట్‌, ప్రముఖ పాపులర్‌ ఫుడ్‌ బ్లాగర్‌​ నిఖిల్‌ పాయ్‌ (29) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది త్రి హంగ్రీ మెన్‌’ అనే ఫుడ్‌ బ్లాగ్‌తో పాపులర్‌  అయిన నిఖిల్‌ ఆత్మహత్య  ఫుడ్‌ లవర్స్‌ను, వ్యాపార వర్గాలను  విస్మయపర్చింది. 

వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన ఆత్మహత్యకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు. తల్లితో గొడవ పడిన నిఖిల్‌ బయటకు వెళ్లారు. ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబం మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. మంగుళూరు మలెమార్‌నగరంలోని ఆయన నివాసంలో మృతదేహాన్నిఆదివారం కనుగొన్నారు. నిఖిల్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

కాగా, ముగ్గురు స్నేహితులతో కలిసి ‘ది త్రీ హం‍గ్రీ మెన్‌’ అనే ఫుడ్‌ బ్లాగ్‌ను 29మే 2009లో ప్రారంభించారు నిఖిల్‌. దీంతోపాటు తండ్రి మరణానంతరం కుటుంబ వ్యాపారాలను కూడా నిఖిల్‌ చూసుకుంటున్నారు. యూట్యూబ్‌లో కార్టూన్ కళపై ఆయన వీడియోలు పాపులర్‌ అయ్యాయి. అలాగే వివిధ  ప్రదేశాల్లో దొరికే విలక్షణ ఆహార పదార్థాలు, వంటకాలపై ఆయన నిర్వహించే రివ్యూలు బహుళ ప్రజాదరణ పొందాయి. నిఖిల్‌కు భార్య, తల్లి , సోదరి ఉన్నారు. త్వరలో ‘ది త్రీ హం‍గ్రీ మెన్‌’ పదేళ్ల వార్షికోత్సవం నిర్వహించుకోనున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు