లాభాల మార్కెట్లోనూ..52 వారాల కనిష్టానికి

27 May, 2020 14:17 IST|Sakshi

 బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ ఎన్‌ఎస్‌ఈలో 32 షేర్లు 52 వారా కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో అర్మాన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బి.సి.పవర్‌ కంట్రోల్స్‌, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌, జీటీఎన్‌ టెక్స్‌టైల్స్‌, ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌, ఇండో టెక్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, కృష్ణా పోస్‌కెమ్‌, ద కర్ణాటక బ్యాంక్‌, లిబాస్‌ డిజైన్స్‌, మాగ్మా ఫిన్‌కార్పొరేషన్‌, ఎంఎంపీ ఇండస్ట్రీస్‌, ముకుండ్‌ ఇంజనీర్స్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ప్రైమ్‌ ఫోకస్‌లు ఉన్నాయి.

గరిష్టాన్ని తాకిన షేర్లు..
ఎన్‌ఎస్‌ఈలో 15 షేర్లు 52 వారాల గరిష్టాన్ని చేరాయి. వీటిలో ఆర్తి డ్రగ్స్‌, ఆల్‌కెమిస్ట్‌, అల్కైల్‌ ఎమైన్స్‌ కెమికల్స్‌, బేయర్‌ క్రాప్‌సైన్సెస్‌, కోరమండల్‌ ఇంటర్నేషనల్‌, ధనుక అగ్రిటెక్‌, ఎడ్యుకంప్‌ సొల్యూషన్స్‌, గొయెంకా డైమండ్‌ అండ్‌ జువెల్స్‌, క్యాప్‌స్టన్‌ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌, మిట్టల్‌ లైఫ్‌స్టైల్‌, ప్రకాశ్‌ స్టీలేజ్‌, రుచీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, శెకావతి పాలి యార్న్‌, వెర్టోజ్‌ అడ్వర్టైజింగ్‌, వినైల్‌ కెమికల్స్‌(ఇండియా)లు ఉన్నాయి.కాగా మధ్యహ్నాం 2:10 గంటల ప్రాంతంలో నిఫ్టీ 297.95 పాయింట్లు లాభపడి 9,324 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 1025.42 పాయింట్లు లాభపడి 31,634.72 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 


 

Related Tweets
మరిన్ని వార్తలు