95 మొబైల్ కంపెనీలొచ్చాయ్‌..!

25 Sep, 2017 13:32 IST|Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ:  డిజిటల్ ఇండియా ప్లాన్‌ లో  95 మొబైల్‌  కంపెనీలు  తమ  ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాయని  ఐటీ శాఖా మంత్రి  రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.   భారతదేశం ఎలక్ట్రానిక్స్  అండ్‌ మొబైల్ తయారీలో పెద్ద కేంద్రంగా మారిందన్నారు. అలాగే  దేశంలో 6 కోట్ల కుటుంబాలను  డిజిటల్-అక్షరాస్యతలోకి తీసుకురావాలని  ప్రభుత్వం భావిస్తోందన్నారు.

95 మొబైల్ తయారీ కర్మాగారాలు  ఇండియాలోకి వచ్చాయనీ,  వీటిలో 32 యూనిట్లు నోయిడా,  గ్రేటర్ నోయిడాలలో   ఏర్పాటయ్యాయని రవిశంకర్‌ ప్రసాద్‌చెప్పారు.  కాపిటల్ ఫౌండేషన్ వార్షిక ఉపన్యాసంలో  మంత్రి   ఈ వివరాలు అందించారు. ప్రతి రోజు 3-4స్టార్టప్‌కంపెనీలను వస్తున్నాయన్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు వదులుకున్న ఐఐటీయన్లు  దేశానికి తిరిగి వచ్చి ఈ కంపెనీలను ప్రారంభించారని తెలిపారు. అలాగే అమెరికరన్‌ సిలికాన్ వ్యాలీలో  51శాతం ఐటి-ఆధారిత నూతన ఆవిష్కరణలు జరుగుతోంటే  వాటిలో 14శాతం భారతీయ నిపులే సృష్టిస్తున్నారని. అలా ఇండియా పురోగతిని  సాధిస్తోందన్నారు.

న్యాయ శాఖా మంత్రికూడా అయిన రవిశంకర్‌ ప్రసాద్‌ డిజిటల్ విధానాన్ని అనుసరిస్తున్న సుప్రీంకోర్టును ప్రశంసించారు.దీనికి సంబంధించి డిజిటల్‌ ​ గ్రిడ్‌ను  సృష్టించామనీ, ఇందులో ఆరుకోట్ల ఆర్డర్లు, తీర్పులు,   దాదాపు 4 కోట్ల పెండింగ్ కేసుల వివరాలు కూడా పొందుపరిచామని తెలిపారు. దీంతో ప్రజలు ఒక్క క్లిక్‌ ద్వారా ఈ  వివరాలను, అప్‌డేట్స్‌ను  పొందవచ్చని వివరించారు.  

 

మరిన్ని వార్తలు