హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ వొడాఫోన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వినియోగదార్ల కోసం ప్రైవేట్ రీచార్జ్ పేరుతో వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చింది. దుకాణదారుకు కస్టమర్లు తమ ఫోన్ నంబరు చెప్పకుండానే రీచార్జ్ చేసుకునే వీలుండడం ఈ సర్వీసుల ప్రత్యేకత. వినియోగదార్లు 12604 నంబరుకు pటజీఠ్చ్టి్ఛ అని ఎస్ఎంఎస్ పంపాలి.
వెంటనే కస్టమర్ మొబైల్కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. రీచార్జ్ సమయంలో రిటైలర్కు మొబైల్ నంబరుకు బదులు ఈ పాస్వర్డ్ ఇస్తే చాలు. రోజంతా ఓటీపీ చెల్లుబాటు అవుతుంది. ఈ సేవలు ఉచితం. కస్టమర్ల ప్రైవసీ కోసమే ప్రైవేట్ రీచార్జ్ను ప్రవేశపెట్టామని వొడాఫోన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ రోహిత్ టాండన్ తెలిపారు.