ఎయిరిండియా బంపర్‌ ఆఫర్‌

11 May, 2019 00:02 IST|Sakshi

చివరి నిమిషం బుకింగ్స్‌పై 50% డిస్కౌంట్‌ 

ముంబై: విమాన డిపార్చర్‌కు మూడు గంటల ముందు బుకింగ్స్‌పై 50 శాతం ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా శుక్రవారం ప్రకటించింది. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన ప్యాసింజర్లకు ఈ ఆఫర్‌ ఎంతగానో ఉపయోగపడనుందని.. సంస్థకు చెందిన కౌంటర్లు, వెబ్‌సైట్, మొబైల్‌ యాప్, ఎజెంట్‌ ద్వారా జరిగే బుకింగ్స్‌కు ఆఫర్‌ వర్తిస్తుందని వెల్లడించింది. ‘హ్యఫ్టీ డిస్కౌంట్‌’ పేరుతో ఈ ఆఫర్‌ లభిస్తోంది.    
 

మరిన్ని వార్తలు