ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా ‘ఇండిపెండెన్స్ డే’ సేల్ను ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లలో విమాన టిక్కెట్లను విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఎయిరిండియా తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఎయిరిండియా ఈ కొత్త ఆఫర్ కేవలం ఆన్లైన్ బుకింగ్స్కు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఎవరైతే క్యారియర్ బుకింగ్ వెబ్సైట్ ఎయిరిండియా.ఇన్లో టిక్కెట్లను బుక్ చేసుకుంటారో వారికి లభ్యం కానుంది. 2018 ఆగస్టు 15 వరకు ఈ సేల్ వాలిడ్లో ఉంటుంది. భారత్ పరిధిలో ప్రయాణం చేసేందుకే ఈ ఆఫర్ వర్తించనుందని ఎయిరిండియా తెలిపింది. ఈ డిస్కౌంట్ను పొందడానికి కస్టమర్లు ప్రోమో కోడ్ బాక్స్లో 18ఐఎన్డీఏఐ ప్రోమోకోడ్ను నమోదు చేయాల్సి ఉంది.
ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్ వివరాలు..
ఎయిరిండియా ప్రత్యర్థి జెట్ ఎయిర్వేస్ కూడా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ, జాతీయ విమాన టిక్కెట్లపై ‘ఫ్రీడం ఫేర్స’ అనే సేల్ను ప్రకటించింది. గోఎయిర్ కూడా 10 లక్షల వరకు సీట్లను రూ.1099కే విక్రయిస్తోంది.
#FlyAI : Celebrate #IndependenceDay with #AirIndia and avail attractive discounts across our network. For details, pl visit https://t.co/FVMhfFHund pic.twitter.com/wijZQaD84p
— Air India (@airindiain) August 9, 2018