విద్యార్థులకు ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్

2 Jun, 2016 00:42 IST|Sakshi
విద్యార్థులకు ఎయిరిండియా డిస్కౌంట్ ఆఫర్

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తాజాగా విద్యార్థుల కోసం ప్రత్యేకమైన టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ.. ఈ పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా చదువు పరంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించే విద్యార్థులకు దేశీ విమాన టికెట్‌ను రూ.3,500 నుంచి అందిస్తోంది. తాజా ఆఫర్ ప్రయాణికులకు జూలై 31 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు జూలై 1 నుంచి ఆగస్ట్ 31 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు